ఇంటికి చేరుకున్న స్పీకర్ దంపతులు
ABN, First Publish Date - 2021-05-13T05:18:13+05:30
స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా నుంచి కోలు కొని బుధవారం ఆమదాలవలసలోని తమ ఇంటికి చేరుకున్నారు.
ఆమదాలవలస: స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా నుంచి కోలు కొని బుధవారం ఆమదాలవలసలోని తమ ఇంటికి చేరుకున్నారు. ఇటీవల కరోన బారినపడడంతో శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఇంటికి చేరుకున్న సందర్భంగా సీతారాం మాట్లాడుతూ, శ్రీకాకుళంలో అనుభవం గల డాక్టర్లు ఉన్నారని, మంచి హెల్త్హబ్గా తయారవుతుందని చెప్పారు. తన ఆరోగ్యంపై శ్రద్ధచూపిన వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా దేవుడు, అభిమానులు దయతో తాను అమ్మ-నాన్న(స్పీకర్) ఇంటికి చేరుకున్నామని సీతారాం తనయుడు వెంకట చిరంజీవి నాగ్ బుధవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. వైద్యుల సలహా మేరకు ఈనెలాఖరు వరకు ఎవరూ క్యాంపు కార్యాలయానికి రావద్దని కోరారు. ఏవైనా పనులు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదిస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
Updated Date - 2021-05-13T05:18:13+05:30 IST