‘స్పందన’ వినతులు పరిష్కరించండి
ABN, First Publish Date - 2021-07-27T05:35:05+05:30
స్పందనలో వచ్చే వినతులను త్వరగా పరిష్కరించాలని ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ అధికారులకు ఆదేశించారు.
పాలకొండ: స్పందనలో వచ్చే వినతులను త్వరగా పరిష్కరించాలని ఆర్డీవో టీవీఎస్జీ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం పాలకొండ ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో వినతులను స్వీకరించారు. రాజాం మండలంలోని కొండమ్మపేటకు చెందిన పోరు పల్లి లక్ష్మి భూమికి సబ్ డివిజన్ కోసం, పాల కొండకు చెందిన నూకల రమేష్ బాయగట్టు ఆక్రమణ తొలగించాలని, పాలకొండ మండలం లోని తుమరాడ పంచాయతీకి చెందిన పొట్నూరు శోభారాణి సర్పంచ్ బ్యాంకు అకౌంట్ పేరు మార్పు కోసం వినతిపత్రాలు అందజేశారు. ఫ పాలకొండ నగర పంచాయతీలోని తొమ్మిది సచివాలయాల పరిధిలో సోమవారం స్పందనా కార్యక్రమాన్ని కమిషనర్ నడిపేన రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి సోమవారమూ నగర పంచాయతీ లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
Updated Date - 2021-07-27T05:35:05+05:30 IST