ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవిటి మండలంలో నకిలీ టీచర్లను తొలగించండి

ABN, First Publish Date - 2021-06-22T05:26:19+05:30

కవిటి మండలంలో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తక్షణం తొలగించాలని కేఎన్‌పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ వి.లక్ష్మీనారాయణకు సంఘ ప్రతినిధులు బెలమర ప్రభాకరరావు, రాకెట్ల ఢిల్లేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు.

ఇన్‌చార్జి తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న కేఎన్‌పీఎస్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేఎన్‌పీఎస్‌ నాయకుల ఫిర్యాదు 

నందిగాం, జూన్‌ 21: కవిటి మండలంలో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తక్షణం తొలగించాలని కేఎన్‌పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ వి.లక్ష్మీనారాయణకు సంఘ ప్రతినిధులు బెలమర ప్రభాకరరావు, రాకెట్ల ఢిల్లేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు. కవిటి మండలంలో ఎక్కువ శాతం నకిలీ దివ్యాంగ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, దీనివల్ల అర్హులైన, నిజమైన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. ఇటువంటి సంఘ టన విజయనగరం జిల్లాలో చోటు చేసుకోగా అక్కడి అధికారులు విచారణ చేసి బాధ్యులను తొలగించారన్నారు. కవిటి మండలంలోని ఈ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు దుర్యోధన, వాసు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-06-22T05:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising