ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలెందుకు?

ABN, First Publish Date - 2021-01-12T06:10:04+05:30

‘సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేద’ంటూ రావివలస గ్రామస్థులు సోమవారం ఆందోళనకు దిగారు.

సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్న రావివలస గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




సిబ్బందిని నిలదీసిన రావివలస గ్రామస్థులు

కార్యాలయానికి తాళం వేసేందుకు యత్నం

 టెక్కలి రూరల్‌, జనవరి 11: ‘సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేద’ంటూ రావివలస గ్రామస్థులు సోమవారం ఆందోళనకు దిగారు. అమ్మ ఒడి పథకం వర్తింపజేయకపోవడంపై మహిళలు సచివాలయ సిబ్బందిని నిలదీశారు. సమస్యలు పరిష్కరించని సచివాలయాలు ఎందుకంటూ కార్యాలయానికి తాళం వేసే ప్రయత్నం చేశారు. పంచాయతీ కార్యదర్శి కె.వినోద్‌కుమార్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ పి.బాబూరావును నిలదీశారు. దాసరి రమణమ్మ, మాట్లాడుతూ సెంటు భూమిలేని తమకు ఏడు ఎకరాలు ఉన్నట్టు చూపించడంతో రేషన్‌కార్డు నిలిచిపోయిందన్నారు. పిల్లలకు అమ్మ ఒడి సైతం అందకుండా పోయిందని వాపోయారు. అర్హత ఉన్నా తమ పిల్లలకు అమ్మ ఒడి వర్తించలేదని అప్పిని సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఒడి అయినా ఇప్పించండి...లేకుంటే ఉన్నట్టు చూపిన భూమినైనా ఇప్పించండి అంటూ కోరడంతో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులు మౌనం దాల్చారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కూన వినోద్‌కుమార్‌, వీఆర్వో పి.నగేష్‌లను వివరణ కోరగా సాంకేతిక సమస్యలతోనే సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.




Updated Date - 2021-01-12T06:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising