ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మదిలో ఏదయినా కుట్ర ఉందా? అనుమానం కలుగుతోంది: రామ్మోహన్ నాయుడు

ABN, First Publish Date - 2021-11-22T20:03:30+05:30

వికేంద్రీకరణ బిల్లు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: వికేంద్రీకరణ బిల్లు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మదిలో ఏదయినా కుట్ర ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. అమరావతి రాజధానిపై టీడీపీ మొదటినుంచి గట్టిగా పోరాడుతోందన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని, సీఎం జగన్ స్వయంగా రాజధానిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మరో నాటకానికి తెరలేపుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకు టీడీపీ పోరాడుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-22T20:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising