ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారుల బడి బాట

ABN, First Publish Date - 2021-02-02T04:32:25+05:30

ప్రాథమిక పాఠశాలలు ఎట్టకేలకు తెరచుకున్నాయి. సోమవారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. పిల్లలంతా మాస్కులతో హాజరయ్యారు. భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయు

పాఠశాలలకు హాజరైన చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




తెరచుకున్న ‘ప్రాథమిక’ పాఠశాలలు
తొలిరోజు 1,83,590 మంది విద్యార్థుల హాజరు
(గుజరాతీపేట)

ప్రాథమిక పాఠశాలలు ఎట్టకేలకు తెరచుకున్నాయి.
సోమవారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమైంది. పిల్లలంతా మాస్కులతో హాజరయ్యారు. భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి 19 నుంచి వీరికి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ఆరు నుంచి పదో తరగతి వరకు గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు వివిధ దశల్లో తరగతులు ప్రారంభించి బోధన సాగిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు వరకు చిన్నారులకు సోమవారం బోధన ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలతో ఉపాధ్యాయులు పాఠశాలకు అనుమతించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు 1,85,799 మంది ఉండగా, తొలిరోజు 1,83,590 మంది  తరగతులకు హాజరయ్యారని ఉపవిద్యా శాఖాధికారి పగడాలమ్మ తెలిపారు.  కొవిడ్‌ నిబంధనలనుసరించి తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  




Updated Date - 2021-02-02T04:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising