శతశాతం జ్వరాల సర్వే చేయాలి
ABN, First Publish Date - 2021-05-18T04:52:38+05:30
కరోనా వైరస్ను అరికట్టేందుకు గ్రామాల్లో చేపడుతున్న ఫీవర్ సర్వే శతశాతం లక్ష్యం నెరవేర్చాలని శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్ తెలిపారు.
శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్
ఎల్.ఎన్.పేట: కరోనా వైరస్ను అరికట్టేందుకు గ్రామాల్లో చేపడుతున్న ఫీవర్ సర్వే శతశాతం లక్ష్యం నెరవేర్చాలని శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్ తెలిపారు. పెద్దకొల్లివలస ఆర్అండ్ఆర్కాలనీ సచివాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులు, సర్వేలైన్స్ సిబ్బందితో సమీక్షించారు. నెలాఖరు వరకు కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించినందున నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావు, తహసీల్దార్ బీఎస్ఎస్ సత్యనారాయణ, రెవెన్యూ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్ఎన్పేట, కడగండి పీహెచ్సీ పరిధిలో సోమవారం 9మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తహసీల్దార్ బీఎస్ఎస్ సత్యనారాయణ, వైద్యాధికారి ఆర్.హేమలత తెలిపారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతీరోజూ ఫీవర్సర్వే చేసి తగు జాగ్రత్తలు వివరించాలన్నారు.
Updated Date - 2021-05-18T04:52:38+05:30 IST