నౌపడ ఏఎస్ఐ నిజాయితీ
ABN, First Publish Date - 2021-05-18T04:52:15+05:30
తనకు దొరికిన పర్సును బాధితురాలికి అప్పగించి ఏఎస్ఐ మెట్ట చంద్రరావు నిజాయితీని నిరూపించుకున్నారు.
నౌపడ (సంతబొమ్మాళి), మే 17: తనకు దొరికిన పర్సును బాధితురాలికి అప్పగించి ఏఎస్ఐ మెట్ట చంద్రరావు నిజాయితీని నిరూపించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మూలపేటకి చెందిన విజయ ద్విచక్ర వాహనంపై సోమవారం నౌపడ వచ్చారు. తిరుగు ప్రయా ణంలో ఆమె పర్సు మార్గ మధ్యం లో జారిపోయింది. నౌపడ-మూల పేట మార్గంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ చంద్రరావుకు ఈ పర్సు దొరికింది. దీనిలో రూ.7 వేల నగదు ఉంది. పర్సులో ఉన్న వివరాలమేరకు బాధితురాలికి సమాచారం అందించారు. ఆమెను నౌపడ స్టేషన్కు పిలిపించి ఆ పర్సును ఎస్ఐ మహ్మద్యాసీన్ అందించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ చంద్రరావును ఎస్ఐతో పాటు బాధితురాలు అభినందించారు.
Updated Date - 2021-05-18T04:52:15+05:30 IST