క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి
ABN, First Publish Date - 2021-04-14T05:20:43+05:30
క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏఆర్ డీఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ తెలిపారు.
ఏఆర్ డీఎస్పీ శేఖర్ ఫ బాల్బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
ఎచ్చెర్ల, ఏప్రిల్ 13: క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏఆర్ డీఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ తెలిపారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు క్వార్టర్స్ ఆవరణలో అండర్-19 బాలబాలికల జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు, ఎంపికలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా ర్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. జిల్లా బాల్బ్యా డ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పీవీజీ కృష్ణంరాజు(మురళి) మాట్లాడుతూ, ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బి.ప్రదీప్, టి.ఉమామహే శ్వరరావు, ఎచ్చెర్ల ఎస్ఐ జి.రాజేష్, పీఈటీలు ఎన్.పార్వతి, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T05:20:43+05:30 IST