గుట్కా నిల్వలు స్వాధీనం
ABN, First Publish Date - 2021-06-20T05:41:14+05:30
జగన్నాథపురంలోని ఓ గోదాంలో గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తిరుపతి తెలిపారు.
నరసన్నపేట : జగన్నాథపురంలోని ఓ గోదాంలో గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తిరుపతి తెలిపారు. పక్కా సమాచారంతో శనివారం సిబ్బందితో దాడి చేసి రూ.95 వేలు విలువ గల గుట్కా, ఖైనీ బస్తాలతోపాటు ఎనిమిది మద్యం సీసాలు గుర్తించామన్నారు. ఈ ఘటనపై ఎం.జగ్గారావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో జోరుగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్న తెలుస్తుందని, ఈ క్రమం లో విస్తృతంగా దాడులు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఎస్ఐ సత్యనారా యణ, ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఫ సంతబొమ్మాళి: నౌపడ పోలీస్స్టేష న్ పరిధిలో శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా, మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిన్నకేశవనాయుడుపేటకు చెందిన కె.శంకర్ నుంచి రూ.6,200 విలువ చేసే గుట్కా, రూ.2,200 విలువైన మద్యం, మూలపేటకు చెందిన కొవరి రమేష్ నుంచి రూ.4వేల విలువగల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహ్మద్యాసీనా తెలిపారు. వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు.
Updated Date - 2021-06-20T05:41:14+05:30 IST