డోలపేటలో అగ్ని ప్రమాదం... దుకాణాలు దగ్ధం
ABN, First Publish Date - 2021-04-20T05:25:16+05:30
రాజాం మునిసిపాల్టీ పరిధి డోలపేటలో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో సోమవారం వేకువ జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి.
రాజాం : రాజాం మునిసిపాల్టీ పరిధి డోలపేటలో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో సోమవారం వేకువ జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ఆలయానికి ఆనుకొని ఉన్న ధర్మారావుకు చెందిన కూరగాయల దుకాణం, మీసాల రామారావును చెందిన సైకిల్ షాపులు దగ్ధమయ్యాయి. షాపుల్లో ఉన్న మొత్తం సామగ్రి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Updated Date - 2021-04-20T05:25:16+05:30 IST