ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా
ABN, First Publish Date - 2021-10-14T05:00:49+05:30
ఆసరా పథకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆసరా పథకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మహిళలకు గౌరవం, భరోసాను సీఎం జగన్ కల్పిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని... దాని ఫలితం చంద్రబాబు అండ్ కో రుచి చూశారన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, అంధవరపు సూరిబాబు, రాజశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-14T05:00:49+05:30 IST