కరోనాను జయించిన వృద్ధ దంపతులు
ABN, First Publish Date - 2021-05-08T05:02:41+05:30
పీఎన్కాలనీలో నివాసముంటున్న ఎస్వీఆర్ఎం పట్నా యక్ (73), కమల (69) దంపతులు కరోనాను జయించారు.
గుజరాతీపేట: పీఎన్కాలనీలో నివాసముంటున్న ఎస్వీఆర్ఎం పట్నా యక్ (73), కమల (69) దంపతులు కరోనాను జయించారు. పట్నాయక్ కేన్స ర్తో, కమల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.ప్రతినెలా కీమోఽథెరపీ కోసం పట్నాయక్, మందుల కోసం కమల విశాఖపట్నం వెళ్లి వస్తుం టారు. ఈ క్రమంలో దంపతులకు కరోనా వైరస్ సోకింది. వారిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. కానీ, వారు భయపడకుండా హోమ్ ఐసోలేషన్లోనే ఉంటూ నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు తమ్మినేని వేణుగోపాల్ పర్యవేక్షణలో వేళకు మందులు, జాగ్రత్తలు తీసుకు న్నారు. దీంతో కొద్దిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డారు. అపోహలు నమ్మవద్దని, తగిన జాగ్రత్తలు తీసు కుంటే కరోనాను పారదోలవచ్చని, గుండె ధైర్యంతో కరోనాను ఎదుర్కొన్నామని పట్నాయక్, కమల తెలిపారు.
Updated Date - 2021-05-08T05:02:41+05:30 IST