మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ABN, First Publish Date - 2021-07-25T05:33:15+05:30
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పిరియా సాయిరాజ్ తెలిపారు.
కంచిలి: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పిరియా సాయిరాజ్ తెలిపారు.శనివారం తలతంపర పంచాయతీలో రోడ్డుపనులకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తునే, గ్రామాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ జగబందుదొళాయి, నాయకులు పి.దేవదాసురెడ్డి, ఐ.కృష్ణారావు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-25T05:33:15+05:30 IST