ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా

ABN, First Publish Date - 2021-08-06T05:15:58+05:30

స్థలం విషయంలో తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని టెక్కలి మేజరు పంచా యతీ ఆదిఆంధ్రావీధికి రౌతు లక్ష్మి బెదిరించింది. చేతితో కిరోసిన్‌ క్యాన్‌ పట్టుకొని హడావుడి చేసింది.

పోలీసులతో వాదిస్తున్న లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కిరోసిన్‌ క్యాన్‌తో మహిళ హడావుడి

టెక్కలిరూరల్‌:స్థలం విషయంలో తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని టెక్కలి మేజరు పంచా యతీ  ఆదిఆంధ్రావీధికి  రౌతు లక్ష్మి బెదిరించింది. చేతితో కిరోసిన్‌ క్యాన్‌ పట్టుకొని హడావుడి చేసింది. పోలీ సులు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించిం ది. వివరాల్లోకి వెళ్తే.. రౌతు లక్ష్మి 2007లో బసవల నూకరాజు, దాలమ్మల వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఈ స్థలం తమదని నూకరాజు బంధువు బసవల గోవింద్‌ ఇటీవల రెవెన్యూ అధికారు లకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఈ స్థలాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ అధి కారులు రావడంతో వివాదం చెలరేగింది. ఈ స్థలం తనదని.. రిజిస్ట్రేషన్‌, ఈసీ పత్రాలు ఉన్నాయని లక్ష్మి అధికారులకు తెలియజేసింది. తనకు అన్యాయం చేస్తే కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.  విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ కామేశ్వరరావు తన సిబ్బందితో ఆదిఆంధ్రావీధి వెళ్లారు. లక్ష్మి తన ద గ్గర ఉన్న పత్రాలను రెవెన్యూ, పోలీసులకు చూపడంతో వివాదం సద్దుమణిగింది.  


 


 


 

Updated Date - 2021-08-06T05:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising