ఢిల్లీ రైతు ఉద్యమంలో జిల్లా నాయకులు
ABN, First Publish Date - 2021-06-15T05:08:29+05:30
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపడుతున్న ఉద్యమానికి జిల్లాకు చెందిన ఇఫ్టూ, ఏఐకేఎంఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
నరసన్నపేట, జూన్ 14: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపడుతున్న ఉద్యమానికి జిల్లాకు చెందిన ఇఫ్టూ, ఏఐకేఎంఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. సోమవారం ఉదయం ఢిల్లీ తూర్పు ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతు ధర్నా శిబిరంలో పాల్గొని ఉద్యమకారులకు మద్దతు ప్రకటించారు. అక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, ఏఐకేఎంఎస్ సంఘ నాయకులు పి.ఈశ్వరరావు, భూషణం, నాని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-15T05:08:29+05:30 IST