అరవసవిల్లికి పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2021-03-01T05:43:22+05:30
రసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం మూడో ఆదివారం స్వామి
గుజరాతీపేట, ఫిబ్రవరి 28: అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం మూడో ఆదివారం స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్గడ్, ఒడిశాల నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది. మరోవైపు వత్సవల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆలయ ప్రాంగణంలో అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలోకి మారిపోయింది. ఈ ఒక్కరోజే రూ.17,43,923ల ఆదాయం లభించింది. దర్శనం టిక్కెట్ల రూపంలో రూ.12,31,600లు, విరాళాల రూపంలో రూ.1,82,323లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.33,000ల ఆదాయం లభించినట్టు ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.
Updated Date - 2021-03-01T05:43:22+05:30 IST