పాఠ్యపుస్తక రచయితలకు అభినందన
ABN, First Publish Date - 2021-07-29T05:18:50+05:30
రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే ఎస్ఈఆర్టీ పాఠ్య పుస్తకాల రచనలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొని జిల్లాకే పేరు తీసుకు వచ్చారని డీఈవో చంద్రకళ అన్నారు.
నరసన్నపేట, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే ఎస్ఈఆర్టీ పాఠ్య పుస్తకాల రచనలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొని జిల్లాకే పేరు తీసుకు వచ్చారని డీఈవో చంద్రకళ అన్నారు. బుధవారం పాఠపుస్తక రచయితలు పి.కోటిబాబు (తెలుగు), సంతోష్ కుమార్ (హిందీ), పి.కాశీవిశ్వనాథరావు (ఇంగ్లీషు), బి. ఉమామహేశ్వరి (సైన్స్), జి.పవన్కుమార్ (గణితం)లను ఆమె శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి విజయ కుమారి, డీసీఈబీ చైర్మన్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-29T05:18:50+05:30 IST