యాంత్రీకరణతో రైతులకు మేలు
ABN, First Publish Date - 2021-07-29T05:23:24+05:30
ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ద్వారా సాగుచేస్తే మంచి దిగుబడితో పాటు పెట్టుబడులు తగ్గుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం మబగాంలో వ్యవసాయ యాంత్రీకరణ, పరికరాల ప్రదర్శన, వ్యవసాయ శిక్షణ తరగతుల శిబిరం నిర్వహించారు.
డిప్యూటీ సీఎం కృష్ణదాస్
మబగాం(పోలాకి), జూలై 28: ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ద్వారా సాగుచేస్తే మంచి దిగుబడితో పాటు పెట్టుబడులు తగ్గుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం మబగాంలో వ్యవసాయ యాంత్రీకరణ, పరికరాల ప్రదర్శన, వ్యవసాయ శిక్షణ తరగతుల శిబిరం నిర్వహించారు. వ్యవసాయంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అధిక దిగుబడిని సాధించాలని ఆకాంక్షించారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జేసీ సుమిత్కుమార్ మాట్లాడుతూ.. జిల్లా రైతులు వ్యవసాయంపై మొగ్గుచూపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెరకు, వేరుశనగ, మినప, పెసర, మిరప, రాగులు, పంటలకు బిందు సేద్య విధానంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాస్త్ర వేత్తలు చిన్నంనాయుడు, శివాజీ, వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-29T05:23:24+05:30 IST