అత్తను హత్య చేసిన అల్లుడు
ABN, First Publish Date - 2021-02-27T06:29:51+05:30
తన భార్యను కాపురానికి పంపలేదని అత్తను హత్య చేశాడు అల్లుడు.
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి26: తన భార్యను కాపురానికి పంపలేదని అత్తను హత్య చేశాడు అల్లుడు. మండలంలోని చెన్నంపల్లికి చెందిన హుస్సేన్బీ (60)ని అల్లుడు మహబూబ్ బాషా శుక్రవారం కొడవలితో నరికి, దారుణంగా హత్య చేశాడు. నార్పలకు చెందిన మహబూబ్ బాషా కారు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. పదేళ్ల క్రితం చెన్నంపల్లికి చెందిన హుస్సేన్బీ కుమార్తె మహబూబీని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కలహా లు కొనసాగుతుండేవి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం హుస్సేన్బీ తన కుమార్తెను చెన్నంపల్లికి పిలుచుకొచ్చింది. దీంతో మహబూబ్ బాషా చెన్నంపల్లికి వచ్చి, తన భార్యను ఎందుకు పిలుచుకు వచ్చావం టూ అత్త హుస్సేన్బీతో శుక్రవారం గొడవకు దిగాడు. ఆ సమయంలో మహబూబ్వీ బయటకు వెళ్లింది. అత్తాఅల్లుళ్ల మధ్య మాటామాటా పెరిగి, వెంట తెచ్చుకున్న కొడవలితో మహబూబ్ బాషా.. అత్త తల, చేతిపై నరికాడు. అనంతరం నార్పల పోలీసుస్టేషన్లో కొడవలితో లొంగిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న హుస్సేన్బీని స్థానికులు 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. హత్యపై కేసు కేసు న మోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. నిందితుడు బుక్కరాయసముద్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2021-02-27T06:29:51+05:30 IST