ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ

ABN, First Publish Date - 2021-04-20T05:26:11+05:30

కాగువాడ రామ మందిరం వీధిలో నివాసముంటున్న బుద్ధ ప్రధాన్‌ ఇంటిలో సుమారు రూ.2,12,500 విలువైన 8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలస్యంగా వెలుగుచూసిన వైనం

పాతపట్నం : కాగువాడ రామ మందిరం వీధిలో నివాసముంటున్న బుద్ధ ప్రధాన్‌ ఇంటిలో సుమారు రూ.2,12,500 విలువైన 8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుద్ధ ప్రధాన్‌ ఈనెల 14న కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని స్వల్ప అస్వస్థతకు గురై ఈ నెల 15 న ఒడిశాలోని జాజిపురంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. ఈ నెల 18న విజయ వాడలోని కుమారుడు స్వగ్రామానికి రాగా తల్లి కుమార్తె ఇంటికి వెళ్లిందని తెలుసుకుని ఇంటిని పరిశీలించేందుకు వెళ్లాడు. అప్పటికే తాళం విరగ్గొట్టి ఉండి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండడాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ విషయాన్ని తల్లికి తెలిపాడు. కాగా ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో క్లూస్‌ టీం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. కాగా కుమార్తె ఇంటి నుంచి వచ్చిన బుద్ధప్రధాన్‌ తన ఇంట్లో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాల వివరాలను పోలీసులకు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌అమీర్‌ ఆలీ తెలిపారు.


Updated Date - 2021-04-20T05:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising