విశాఖలో సోము వీర్రాజు అధ్యక్షతన నేడు కోర్ కమిటీ భేటీ
ABN, First Publish Date - 2021-01-17T12:40:09+05:30
సోము వీర్రాజు అధ్యక్షతన ఆదివారం విశాఖలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఆదివారం విశాఖలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే తిరుపతి ఉప ఎన్నిక, విగ్రహాల విధ్వంసం, రథయాత్ర ఖరారుపై చర్చలు జరపనున్నట్లు తెలియవచ్చింది.
Updated Date - 2021-01-17T12:40:09+05:30 IST