ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి సభ చరిత్ర సృష్టించింది: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2021-12-18T20:39:04+05:30

తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో సభ విజయవంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో సభ  విజయవంతమైంది. అకుంఠిత దీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషం. ఒక్క వైసీపీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు, యువజన, కార్మిక, రైతు, ప్రజాసంఘాలన్నీ రాజధాని రైతులకు జైకొట్టాయి. అధికార వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు బనాయించినా, ఆటంకాలు సృష్టించినా  భగవంతుడితో పాటు రాష్ట్ర ప్రజలందరూ అమరావతి వైపే నిలిచారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుంది.ఇక్కడేమో రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా జగన్మోహన్‌రెడ్డి మనస్సు కరగకపోవడం దురదృష్టకరం.మంచి మనస్సు చేసుకోకపోగా రైతుల సభకు పోటీగా వికేంద్రీకరణ సభ పెట్టి కాలేజీల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తరలించి గబ్బు పట్టడం అవసరమా. ఇప్పటికే సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-12-18T20:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising