ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు నైపుణ్య శిక్షణ

ABN, First Publish Date - 2021-05-06T09:34:53+05:30

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) పథకానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి కల్పిస్తాం: మంత్రి గౌతమ్‌ రెడ్డి


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) పథకానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.  పరిశ్రమలు, ఎలక్ర్టానిక్స్‌, ఐటీ తదితర రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎల్‌ఐ పథకాలను ప్రకటించాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకుని ప్రారంభించే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ప్రారంభిస్తామని వెల్లడించారు. రంగాల వారీగా శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-05-06T09:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising