ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కథా రచయిత సింగమనేని కన్నుమూత

ABN, First Publish Date - 2021-02-25T19:49:40+05:30

ప్రముఖ కథారచయిత, సాహితీ విమర్శకులు సింగమనేని నారాయణ కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ప్రముఖ కథారచయిత, సాహితీ విమర్శకులు సింగమనేని నారాయణ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సింగమనేని నారాయణ స్వస్థలం అనంతపురం జిల్లాలోని బండమీదపల్లి గ్రామం. 1943 జూన్ 23న జన్మించారు. 


సింగమనేని 43కు పైగా కథలు రాశారు. వీరు రచించిన మొట్ట మొదటి కథ ‘న్యాయమెక్కడ?’ 1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. జూదం, సింగమనేని నారాయణకథలు, అనంతం, సింగమనేని కథలు అనే కథా సంపుటాలను, ఆదర్శాలు - అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు రాశారు. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు ‘కథలు - కథన’ రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగు కథ’ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించారు.


సింగమనేని మృతిపట్ల సాహితీ ప్రేమికులు సంతాపం తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ..  విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు మెంబర్‌గా ఉన్న నారాయణ మృతి బాధాకరమన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.  

Updated Date - 2021-02-25T19:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising