ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలంపల్లికి రాజధాని సెగ

ABN, First Publish Date - 2021-07-25T07:44:51+05:30

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకు రాజధాని సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి రాజధానిలోని తాళ్లాయపాలెం పరిధిలో గల శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి రాగా, మంత్రిని కలిసేందుకు రాజధాని మహిళలు, రైతులు యత్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, జూలై 24: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకు రాజధాని సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి రాజధానిలోని తాళ్లాయపాలెం పరిధిలో గల శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి రాగా, మంత్రిని కలిసేందుకు రాజధాని మహిళలు, రైతులు యత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో.. స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వస్తున్న మంత్రికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు లాగేసి, మంత్రిని వాహనంలోకి ఎక్కించి పంపించేశారు. ఆలయ నిర్మాణంపై మంత్రి సమాధానం కూడా చెప్పలేక తప్పించుకుపోవడం సిగ్గుచేటని రాజధాని రైతులు, దళిత జేఏసీ సభ్యులు విమర్శించారు. ఆలయ నిర్మాణానికి తొలుత ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాలు యథాతథంగా ఉంచి ఆలయ అభివృద్ధిని త్వరరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు.. 

Updated Date - 2021-07-25T07:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising