ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూతులు మాట్లాడే వారికి ప్రజల సొమ్ముతో భద్రతా!!: విష్ణుకుమార్‌రాజు

ABN, First Publish Date - 2021-11-26T09:25:38+05:30

బూతులు మాట్లాడే వారికి ప్రజల సొమ్ముతో భద్రతా!!: విష్ణుకుమార్‌రాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనితీరు ఆక్షేపణీయంగా ఉంది. ఆయన నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును నానా విధాలుగా దూషించి, నిత్యం బూతులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ప్రజల సొమ్ముతో అదనపు భద్రత కల్పించడం ఏ రకమైన న్యాయం?’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలంతా ఆ నాయకులను చూసి చీదరించుకుంటున్నారన్నారు. అటువంటి వ్యక్తులను బూతులు మాట్లాడవద్దని హెచ్చరించడమో, పదవులను నుంచి తప్పించడమో చేయాలన్నారు. కానీ, ఇలా అదనపు భద్రతను కల్పించడం చూస్తుంటే.. వారిని పరోక్షంగా సీఎం మరింత ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నారు. తుఫాన్లు, వరదలు రావ డం సహజమేనని, ఆ సమయంలో సీఎం స్పందించాల్సిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. కానీ జగన్‌ తనకేమీ పట్టనట్టు వ్యహరించడం బాధ కలిగిస్తోందన్నారు.  

Updated Date - 2021-11-26T09:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising