గుంటూరు జిల్లాలో సర్పంచ్ల భిక్షాటన
ABN, First Publish Date - 2021-11-23T23:18:51+05:30
జిల్లాలోని వట్టిచెరుకూరులో పలు గ్రామాల సర్పంచ్లు
గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరులో పలు గ్రామాల సర్పంచ్లు భిక్షాటన చేశారు. 14, 15వ ఆర్థికసంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై నిరసన తెలిపారు. 14, 15వ ఆర్థికసంఘం నిధులను కేంద్రమే ఇస్తుందని సర్పంచ్లు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులను తిరిగి ఇవ్వాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-23T23:18:51+05:30 IST