ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీబీ రూల్స్ పాటించని ఏ కంపెనీ అయినా మూతే: సజ్జల

ABN, First Publish Date - 2021-08-04T23:36:11+05:30

పీసీబీ రూల్స్ పాటించని ఏ కంపెనీ అయినా మూతే: సజ్జల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అమరరాజా కంపెనీ తరలిపోతుండడంపై ఏబీఎన్ ప్రతినిధి వివరణ అడిగారు. పీసీబీ నిబంధనలు పాటించని ఏ కంపెనీ అయినా మూతేనని ఆయన పేర్కొన్నారు. పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఇక్కడే ఉండొచ్చనని సజ్జల వ్యాఖ్యానించారు. కంపెనీ ఎంత పెద్దది అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. కార్మికుల పొట్టగొడితే ప్రభుత్వానికి ఏం సంబంధమని సజ్జల వ్యాఖ్యానించారు. 


కాగా అమరరాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లా కరకంబాడీ నుంచి తరలిపోతోంది. మూడు నెలల్లో తమిళనాడులో అమరరాజాను నెలకొల్పేందుకు నిర్వాకులు సన్నాహాలు ప్రారంభించారు. సీఎం స్టాలిన్‌ను కలిసి  భూమి కేటాయించాలని కోరారు. దీంతో ఆయన వెంటనే అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరోవైపు బ్యాటరీస్ తరలిపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. 




Updated Date - 2021-08-04T23:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising