అమరావతిలో ఏదో కేసులో ‘నిజాలు’ బయటకొస్తాయి: సజ్జల
ABN, First Publish Date - 2021-07-25T08:05:23+05:30
‘‘అమరావతిలో చాలా అవకతవకలు జరిగాయి. ఏదో ఒక కేసులో నిజాలు బయటకు వస్తాయి. అయితే, అవి ఇన్సైడర్ ట్రేడింగే కాకపోవచ్చు
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతిలో చాలా అవకతవకలు జరిగాయి. ఏదో ఒక కేసులో నిజాలు బయటకు వస్తాయి. అయితే, అవి ఇన్సైడర్ ట్రేడింగే కాకపోవచ్చు. మరేదైనా కేసు కావొచ్చు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ చంద్రబాబు చెప్పడమే తప్ప టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయబోరని సజ్జల విమర్శించారు.
Updated Date - 2021-07-25T08:05:23+05:30 IST