రీపోలింగ్ పెడితే సీఈసీ అవమానించుకున్నట్లే : సజ్జల
ABN, First Publish Date - 2021-04-19T09:51:16+05:30
తిరుపతి లోక్సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చెబుతోందని .. అలా రీపోలింగ్ జరిపితే కేంద్ర ఎన్నికల కమిషన్
అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చెబుతోందని .. అలా రీపోలింగ్ జరిపితే కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తనకు తాను అవమానించుకున్నట్లేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రీపోలింగ్ కోరడంలో హేతుబద్దత లేదన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఓటమికి టీడీపీ కారణాలు వెతుక్కుంటోందన్నారు.
Updated Date - 2021-04-19T09:51:16+05:30 IST