ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని అదానీ లాంటి వారికి ప్రధాని మోదీ అమ్మేస్తున్నారు: శైలజానాధ్

ABN, First Publish Date - 2021-01-17T18:21:02+05:30

ప్రజల ఆకలిని వ్యాపారం చేసే ప్రక్రియ బీజేపీ చేస్తోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: దేశ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే.. ప్రజల ఆకలిని వ్యాపారం చేసే  ప్రక్రియ బీజేపీ చేస్తోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ చంద్రబాబు, జగన్.. మోదీ కాళ్ళను మొక్కి దేశంలోని రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని, రైతులపై అబద్దపు కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన అన్నీ బిల్లులకు సీఎం జగన్ మద్దతు ఇచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకులని, దేశాన్ని అదానీ లాంటి వారికి అమ్మేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను సమర్థించే వారు, బీజేపీ తాబేదార్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారని, వ్యవసాయ చట్టాలను భేషరుతుగా వెనక్కి తీసుకోవాలని శైలజానాధ్ డిమాండ్ చేశారు.


రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈనెల 19వ తేదీన గవర్నర్‌ను కలుస్తామని శైలజానాధ్ తెలిపారు. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలో మతాన్ని రాజకీయానికి ముడిపెట్టి మాట్లాడే పార్టీలవల్లే దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని నడిరోడ్డుపై ప్రభుత్వం ఎందుకు నిలబెట్టలేక పోతోందని శైలజానాథ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-01-17T18:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising