ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ, జగన్‌పై మండిపడ్డ శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-04-30T00:04:31+05:30

ప్రధాని మోదీ, సీఎం జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోదీ, సీఎం జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రధాని, సీఎం కలుగుల్లో దాక్కున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొంటే వీరు కేవలం ప్రవచనాలతో సరిపుచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసమర్థ ప్రధాని, చేతగాని ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. గొప్పలకు పోయి 80 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసి దేశ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆయన తప్పుబట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసి నీతులు చెప్పడం మోదీకే చెల్లిందన్నారు. ఇల్లు తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తిలా ప్రధాని, సీఎం తీరు ఉందని శైలజానాథ్‌ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-04-30T00:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising