కరోనా ఎఫెక్ట్.. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం
ABN, First Publish Date - 2021-04-26T01:21:36+05:30
మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
విశాఖ: మాజీ ఎంపీ సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా సబ్బం హరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
సబ్బం హరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నెల 15న పాజిటివ్ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోంక్వారంటైన్లో ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు.
Updated Date - 2021-04-26T01:21:36+05:30 IST