చంద్రబాబు సమక్షంలో TDPలో చేరిన రిటైర్డ్ IPS
ABN, First Publish Date - 2021-12-15T20:15:35+05:30
ప్రతిపక్ష టీడీపీలోకి పెద్ద ఎత్తున ప్రముఖులు, మాజీ ఆఫీసర్లు, నేతలు చేరిపోతున్నారు.
అమరావతి : ప్రతిపక్ష టీడీపీలోకి పెద్ద ఎత్తున ప్రముఖులు, మాజీ ఆఫీసర్లు, నేతలు చేరిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన చేరికలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు అధికార పార్టీకి చెందిన అసంతృప్త నేతలు, ప్రముఖులు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శేక్షావలి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శేక్షావలి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నూర్ భాషా వర్గ నేతలకు కూడా కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శేక్షావలి మాట్లాడుతూ.. అధినేత చెప్పినట్లుగా నడుచుకుని.. పార్టీ బలోపేతం కోసం అన్ని విధాలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.
Updated Date - 2021-12-15T20:15:35+05:30 IST