పంట పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ABN, First Publish Date - 2021-04-21T20:44:29+05:30
పంట పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు
కృష్ణా: గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఉంగుటూరు మండలం మానికొండ పంట పొలాల్లో బస్సు పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి గుడివాడకు 20 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతుంది. మానికొండ గ్రామ సమీపంలో పంటపొలాల్లో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. స్వల్ప గాయాలతో 30 మంది ప్రయాణికులు బయటపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-04-21T20:44:29+05:30 IST