గోదావరిలో రోశయ్య అస్థికల నిమజ్జనం
ABN, First Publish Date - 2021-12-09T02:00:54+05:30
మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో
రాజమహేంద్రవరం: మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో బుధవారం శాస్ర్తోక్తంగా నిమజ్జనం చేశారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ రోశయ్య కుమారులు శివసుబ్బారావు, ఎస్ఎన్ మూర్తి ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపూజ చేసి అస్థికలను టూరిజం బోట్లలో నది మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
ఇటీవల రోశయ్య కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
Updated Date - 2021-12-09T02:00:54+05:30 IST