ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో రోశయ్య అస్థికల నిమజ్జనం

ABN, First Publish Date - 2021-12-09T02:00:54+05:30

మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం: మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య అస్థికలను రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద పవిత్ర గోదావరి నదిలో బుధవారం శాస్ర్తోక్తంగా నిమజ్జనం చేశారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ రోశయ్య కుమారులు శివసుబ్బారావు, ఎస్‌ఎన్‌ మూర్తి ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపూజ చేసి అస్థికలను టూరిజం బోట్లలో నది మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. 


ఇటీవల రోశయ్య కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.

Updated Date - 2021-12-09T02:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising