ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇంకా ఏం పీకాలి?’ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-09-18T14:14:22+05:30

వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధకరమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధకరమన్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబు కోడెలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమయ్యారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఎలా వుండాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలన్నారు.


ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లను విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగించడమే కాకుండా... 33శాతం మద్యం దుకాణాలను ఎత్తివేశారని రోజా పేర్కొన్నారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పీకేశారన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పీకేశారన్నారు. అడ్డదారిన మంత్రి అయ్యిన లోకేశ్ పదవి పీకేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని…ఇంకా ఏం పీకాలని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.


Updated Date - 2021-09-18T14:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising