ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

ABN, First Publish Date - 2021-10-29T10:03:51+05:30

మే నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మే నాటికి రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల మరమ్మతుల టెండర్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల రుణం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఆ రుణం మంజూరైందని కృష్ణబాబు సీఎంకు తెలిపారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించిన 380 టెండర్లకు బిడ్‌లు దాఖలయ్యాయని, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించామని, మిగతా టెండర్లు నవంబరు రెండో వారానికి పూర్తి చేస్తామని కృష్ణబాబు వివరించారు. వచ్చే ఏడాది మే నాటికి రహదారుల మరమ్మతులన్నీ పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఆ విషయాలను కృష్ణబాబు మీడియాకు వివరించారు.


Updated Date - 2021-10-29T10:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising