ఉద్యోగుల పీఎఫ్ సొమ్మూ మళ్లిస్తారా?
ABN, First Publish Date - 2021-01-17T08:51:38+05:30
జగన్కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు జనానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగుల పక్షపాతిలా మాట్లాడి, డీఏలు ..
ఎమ్మెల్సీ జగదీశ్వరరావు
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జగన్కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు జనానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగుల పక్షపాతిలా మాట్లాడి, డీఏలు ఎప్పటికప్పుడు ఇస్తానన్న జగన్.. ఉద్యోగులు దాచుకునే పీఎఫ్ సొమ్మును కూడా సంక్షేమ పథకాలకు మళ్లించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. శింగరాయకొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వంసం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.
Updated Date - 2021-01-17T08:51:38+05:30 IST