రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2021-09-14T23:46:15+05:30
ఏపీలోని రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాయలసీమ
తిరుపతి: ఏపీలోని రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేసారు. రాయలసీమపై ప్రేమ ఒలకబోస్తున్న బీజేపీ ప్రత్యేక రాయలసీమను ఇవ్వాలన్నారు. లేదా జమ్ముకాశ్మీర్ తరహాలోనే ప్రత్యేక చట్టం రాయలసీమలో అమలయ్యేలా చూడాలని కోరారు. ప్రత్యేక రాయలసీమకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ, వైసీపీలు కోమాలోకి పోతాయని ఆయన హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రాయలసీమకు చెందిన వారికి కాకుండా, ఎక్కడి వారినో పోటీలో నిలబెట్టడం వల్లనే బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాయలసీమ కోసం వివిధ పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, సీనియర్ రాజకీయ నేతలను, స్వచ్ఛంద సంస్థలు, మేధావులను కలుస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక రాయలసీమ పోరాటాన్ని ఉదృతం చేయనున్నానని ఆయన తెలిపారు.
Updated Date - 2021-09-14T23:46:15+05:30 IST