ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2021-07-04T18:34:39+05:30

వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనసేన నాయకుడు పోతిన మహేష్ కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు.


ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తండ్రి రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. కరోనా సమయంలోనూ రంగాపై అభిమానంతో తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.


జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ రంగా పేద ప్రజల ఆశాజ్యోతి అని, ఆయన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారన్నారు. అందుకే కులమతాలకు అతీతంగా అందరి మనసుల్లో రంగా నిలిచిపోయారని కొనియాడారు. జిల్లాల పునర్విభజన జరిగితే రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలోనే వంగవీటి రంగా పేరు పెట్టాలని సిఎం జగన్‌‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిల బెట్టుకోవాలని పోతిన వెంకట మహేష్ అన్నారు.


Updated Date - 2021-07-04T18:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising