రామతీర్థం రాముడి విగ్రహం సిద్ధం
ABN, First Publish Date - 2021-01-22T08:51:47+05:30
రామతీర్థంలో ధ్వంసమైన రాముల వారి విగ్రహాన్ని తిరుపతిలోని టీటీడీ శిల్ప కళాశాలలో సిద్ధం చేశారు.
తిరుపతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రామతీర్థంలో ధ్వంసమైన రాముల వారి విగ్రహాన్ని తిరుపతిలోని టీటీడీ శిల్ప కళాశాలలో సిద్ధం చేశారు. దేవదాయశాఖ స్తపతి ఇచ్చిన డ్రాయింగ్ మేరకు, టీటీడీకి చెందిన స్తపతులు మునిశంకర్, మారుతిరావు ఆధ్వర్యంలో శిల్పులు సుబ్రమణ్యాచారి సీతమ్మ విగ్రహాన్ని, నాగరాజు లక్ష్మణ విగ్రహాన్ని, రమేశ్ శ్రీరాముడి విగ్రహాన్ని 14 రోజుల్లో పూర్తి చేశారు.
Updated Date - 2021-01-22T08:51:47+05:30 IST