జగన్ కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారు: రామకృష్ణ
ABN, First Publish Date - 2021-05-15T17:19:35+05:30
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతమన్నారు. దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంటే సీఎం జగన్ కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నారన్నారు. సాక్షాత్తు ఎంపీని అరెస్టు చేయించి, సీఎం జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదనే సంకేతాలిచ్చారని రామకృష్ణ వెల్లడించారు.
Updated Date - 2021-05-15T17:19:35+05:30 IST