ఆక్సిజన్ కొరత మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత: రామకృష్ణ
ABN, First Publish Date - 2021-05-06T09:39:40+05:30
ఆక్సిజన్ అందక జరిగే మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్ అందక జరిగే మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరంలలో ఆక్సిజన్ కొరతతో చనిపోయారన్నారు. మళ్లీ తాజాగా అనంతపురంలో ఆక్సిజన్ లేక మరణించడం బాధాకరమన్నారు. ఏపీలో ప్రస్తుతానికి 480 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉందన్నారు. కేసులు ఇలాగే పెరుగుతుంటే ఈ నెల 15 తర్వాత 1,000 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందన్నారు. కరోనా ఉధృతికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-05-06T09:39:40+05:30 IST