ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నోటీసు

ABN, First Publish Date - 2021-07-20T17:52:18+05:30

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో రెండో రోజు మంగళవారం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి రూల్‌ 267 కింద నోటీసు ఇచ్చారు. దాన్ని రాజ్యసభ చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో ప్లకార్డ్‌ పట్టుకుని విజయసాయి రెడ్డి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను గంటపాటు వాయిదా వేశారు.


మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు రూల్‌ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ రూల్‌ 267 కింద 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని. అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమేనని, దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఛైర్మన్ మాట్లాడుతూ ‘దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని’ అన్నారు. చైర్మన్‌ సమాధానంపై సంతృప్తి చెందని విజయసాయి ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద ప్రదర్శిస్తూ నిలబడ్డారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

Updated Date - 2021-07-20T17:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising