ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో జగన్నామస్మరణ: పుట్టా సుధాకర్ యాదవ్

ABN, First Publish Date - 2021-10-14T21:26:08+05:30

తిరుమల క్షేత్రాన్ని, శ్రీవారి మహత్యాన్ని జగన్ ప్రభుత్వం మంటగలుపుతోందని పుట్టా సుధాకర్ యాదవ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పరమ పవిత్రమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రాన్ని, శ్రీవారి మహత్యాన్ని జగన్ ప్రభుత్వం మంటగలుపుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామివారి సన్నిధిలో గోవింద నామస్మరణకు బదులుగా జగన్మామస్మరణ చేయడమేంటని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ సతీమణి దగ్గరుండి మరీ జగన్నామస్మరణ చేయించడం క్షమించరాని మహాపరాధమన్నారు. తిరుమలలో జరిగిన మహాపరాధంపై  వైవీ సుబ్బారెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. హిందూమతాన్ని, హిందువులను గౌరవించలేని వ్యక్తి టీటీడీ ఛైర్మన్ పదవికి అనర్హుడన్నారు. సుబ్బారెడ్డి తక్షణమే టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఇంత ఘోరం జరుగుతుంటే స్వామీజీలు, పీఠాధిపతులు ప్రభుత్వాన్ని, పాలకులను ఎందుకు ప్రశ్నించడంలేదని పుట్టాసుధాకర్ యాదవ్ నిలదీశారు.

Updated Date - 2021-10-14T21:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising