ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలి’

ABN, First Publish Date - 2021-02-01T23:47:04+05:30

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, గవర్నర్ బిశ్వభూషన్ త్వరగా ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని న్యాయవాది విజయ్‌బాబు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, గవర్నర్ బిశ్వభూషన్ త్వరగా ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని న్యాయవాది విజయ్‌బాబు కోరారు. దేవాలయాలమీద దాడులు జరిగినప్పుడు స్పందించామని, ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అంశం మీద కూడా స్పందించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. హైకోర్టు తీర్పు తనకు ఇచ్చిన కండక్ట్ సర్టిఫికేట్‌గా నిమ్మగడ్డ భావిస్తున్నారని, ఏ ప్రకటన చేసినా కోర్టును ఒక బూచిలా చూపిస్తున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వ సలహాదారుపై, మంత్రులపై ఆటోక్రసి చూపిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఎస్ఈసీ మరొక రాజ్యాంగ బద్ధమైన సంస్ధ హక్కులను కాలరాయకూడదని విజయ్‌బాబు సూచించారు. 

Updated Date - 2021-02-01T23:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising