టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్
ABN, First Publish Date - 2021-07-30T22:10:21+05:30
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్
అమరావతి: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కొండపల్లి వెళ్లనున్నారు. తమ వెంట మైనింగ్, అటవీ వాఖ అధికారులను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
Updated Date - 2021-07-30T22:10:21+05:30 IST