యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-02-25T04:33:49+05:30
యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిన్నబోయలపల్లిలో బుధవారం జరిగింది.
ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 24 : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిన్నబోయలపల్లిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిన్నబోయలపల్లికి చెందిన వేగినాటి (22) బహిర్భూమికి వెళ్లి వేపచెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. డిగ్రీ చదువుకున్న గోపి ఏడాది కాలంగా గుంటూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 22న గుంటూరు నుంచి గ్రామానికి వచ్చాడు. బుధవారం బయటకు వెళ్లిన గోపి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయంత్రానికి గోపీ మృతదేహాన్ని గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముక్కంటి తెలిపారు.
Updated Date - 2021-02-25T04:33:49+05:30 IST